తెలుగు సినిమాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుల్లో జయసుధ ఒకరు. సహజ నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు ఆమె. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోల వద్ద అవకాశాలు దక్కించుకుంటూ జయసుధ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దక్షిణాది సినిమాల్లో అన్నింటి లోను ఆమె నటించారు. అగ్ర హీరోల పక్కన వరుసగా సినిమాలు చేసారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె అమ్మ పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ పాత్రల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది పక్కన పెడితే ఈమె రాజకీయాల్లోకి కాంగ్రెస్ ద్వారా అడుగు పెట్టి తెలంగాణా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ప్రజలకు దగ్గరయ్యారు... ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే కాకుండా ఇతర పార్టీల నాయకులతో కూడా ఆమె ఏ భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయాలు చేసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె ప్రయత్నాలు చేసారు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు ఆమె. అయినా సరే ఆమె సినిమాల మీద ఉన్న ప్రేమతో సినిమాలు వదిలిపెట్టలేదు. ఇప్పటికి టాలీవుడ్ లో అగ్ర నటిగా ఉన్నారు ఆమె. అమ్మ పాత్రలు చేస్తూ ఆమె బిజీ గా ఉన్నారు. నితిన్ కపూర్ ని వివాహం చేసుకోగా ఆమెకు ఇద్దరు కొడుకులు. ఇటీవల పెద్ద కుమారుడు వివాహం అత్యంత ఘనంగా చేసారు. రాజకీయాల్లో ఆమె మళ్ళీ వచ్చే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: