టాలీవుడ్ లో కొన్ని కొన్ని ప్రేక్షకులకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఈ  మధ్య కాలంలో ఆశ్చర్యాన్ని కలిగించింది పూరి జగన్నాథ్ చార్మీ కలిసి ఉండటం. పూరి వ్యవహారాలూ అన్నీ కూడా ఛార్మి నే దగ్గర ఉండి చూస్తున్నారు. పూరి వ్యవహారాల్లో ఆమె కీలకం కావడమే కాదు పూరి సినిమాలకు హీరోయిన్ లను ఎంపిక చేయడం తో పాటుగా దర్శకుడి కథల విషయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను చెప్పడం తనకు నచ్చకపోతే కథ మార్చాలి అని చెప్పడం హీరోలకు కథను ఆమెనే స్వయంగా వినిపించడం వంటివి జరుగుతున్నాయి. 

 

ఇలా పూరి జీవితంలో ఆమె ప్రతీ ఒక్కటి భాగం అయిపోయారు. చివరికి పూరి సినిమాల అధికారిక ప్రకటన కూడా ఆమె నే చేస్తూ వస్తుంది. ప్రతీ సినిమాలో కూడా ఆమె భాగస్వామ్యం ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆమె లేకుండా పూరి ఏ ఒక్కటి కూడా చేసే పరిస్థితి లేదు అనేది వాస్తవం. పూరి ఆలోచన పంచుకోవడమే కాకుండా పూరికి అన్ని విధాలుగా ఆమె అండగా ఉంటుంది. డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో కూడా పూరికి ఆమె అందగానే ఉన్నారు. ఎక్కడా కూడా భయపడకుండా తోడు నడిచిన సందర్భం ఉంది. దీనితో వీరి మధ్య ఏదో ఉంది అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి 

 

కాని వాళ్ళు ఇద్దరు మాత్రం ఎప్పుడు కూడా తమ మధ్య ఎం ఉంది అనేది చెప్పలేదు. కాని కొంచెం దొరికితే ఎంతో అతి చేసే సోషల్ మీడియా మాత్రం వీరి గురించి ఎన్నో కథనాలు రాస్తూ వచ్చింది. భార్య ఒప్పుకుంది అని కొందరు భార్య ఏడ్చింది అని కొందరు ఏదో ఒకటి రాస్తూ వస్తున్నారు పూరికి మాత్రం చార్మీ చాలా కీలకం అనే విషయం అర్ధమవుతుంది ఈ మధ్య కాలంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: