బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవలే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా సోకినా పెడచెవిన పెట్టి స్టార్ హోటల్స్ లో దిగి హల్ చల్ చేసింది. పలువురికి వ్యాధి అంటించింది. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందారు. ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వ్యైదులు వివరించారు. వరుసగా నాలుగు సార్లు పాజిటీవ్ రావడంతో అందరూ కంగారు పడ్డారు. మొత్తానికి కరోనాని ఈ సింగర్ జయించింది. కనికా దైర్యం కోల్పోకుండా వైద్య సిబ్బందికి సహకరించిందని వారు పేర్కొన్నారు. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతకు ఆయన కూతుళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన కూతుళ్లలో ఒకరికి ఇప్పుడు నయం అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీకి కరోనా అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
తెలుగు, హిందీ భాషలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ ఘోష్. 'కోయి జానేనా' సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ అమ్మడికి ప్రస్తుతం ఆఫర్స్ అంతంత మాత్రమే వస్తున్నాయి. గత కొద్ది లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన పాయల్ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందట. తలనొప్పి, జ్వరం బాగా వస్తుండడంతో పాయల్ కుటుంబసభ్యులు ,సన్నిహితులు చాలా ఆందోళన చెందారు. ఇది కరోనా కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. మలేరియానే అంటూ వివరణ ఇచ్చింది పాయల్ ఘోష్. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చింది.