ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమ చూపు మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉన్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అయినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు మొదటి సారి కలిసి మల్టీస్టారర్ గా నటిస్తున్న సినిమా కావడం... వీరిద్దరూ స్వతంత్ర సమరయోధుల పాత్రలో నటిస్తుండడం.. ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చి పెడుతుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 8 న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎంత ఆలస్యమైనా అవుట్ పుట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు రాజమౌళి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కూడా రాజమౌళి అలాగే ఉన్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి జరగడం..లాక్ డౌన్ అమలు కావడంతో.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కాస్త వాయిదా పడడంతో మిగిలిన భాగం పెండింగ్లో ఉండిపోయింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రబృందం ప్రకటించిన విధంగా ఈ సినిమా విడుదల కావడం కష్టమే అని అర్ధమైపోయింది. మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడవచ్చు అని వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇలా వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట జక్కన్న . ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భాగంలో కొంతమేర మార్పులు చేసి సత్వరంగా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అవుట్ డోర్ షెడ్యూల్స్ కొన్ని తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర బృందంతో చర్చలు కూడా జరపగ అందరూ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక చిత్రీకరణ జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే... ఈ సినిమాకు సంబంధించి మిగిలి ఉన్న భాగాన్ని సత్వరంగా చిత్రీకరణ జరిపి... ముందుగా అనుకున్న విధంగా జనవరి 8వ తేదీన విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. అయితే కొద్దిగా మార్పులు చేయడం కారణంగా ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని రాజమౌళి భావిస్తున్నారట. ఇక ఈ వార్తతో అటు నందమూరి మెగా అభిమానుల్లో ఎంతగానో ఉత్సాహం ఉండిపోయింది.