ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా తెరంగేట్రం చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో హీరోగా నటించడం జరిగింది. ఆపై శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని హీరోగా మంచి క్రేజ్ దక్కించుకున్నారు ప్రభాస్. ఆ తర్వాత ఛత్రపతి, బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి వంటి సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న ప్రభాస్ వాటి అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాలతో ఎవరికీ అందనంత ఎత్తులో పాన్ ఇండియా హీరోగా భారీ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్థ ప్రేమ కథకు రూపం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా భాగ్యశ్రీ, కృష్ణంరాజు, జయరామ్, ప్రియదర్శి, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థ కు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్.

పలు తమిళ చిత్రాలకు సంగీతాన్ని అందించి మంచి పేరు దక్కించుకున్న జస్టిన్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ అందించడం జరిగింది. కాగా తమ సినిమాకు అతడైతేనే న్యాయం చేయగలడని భావించిన రాధేశ్యామ్ మూవీ దర్శకనిర్మాతలు ఇటీవల ఆయనను ఫైనల్ చేశారని అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: