ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు తమ మధ్య మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరిలో ప్రభాస్, రానా, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక నిన్న యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ 41వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ తారలు వారి బెస్ట్ విషెస్ ని అందిస్తున్నారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళికి ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో అదే తరహాలో ఆ సినిమా కోసం ఐదేళ్లు మరో సినిమాను టచ్ చేయకుండా కష్టపడిన ప్రభాస్ కి కూడా మంచి గౌరవం దక్కింది. కలెక్షన్స్ కంటే కూడా వారి స్థాయి చిరస్థాయిగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక మన స్టార్ హీరోలు కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెబల్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంధించడంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. సాధారణంగా మహేష్ అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ప్రభాస్ పుట్టినరోజుకు కూడా మహేష్ బాబు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రభాస్! మీకు అనంతమైన విజయం, ఆనందం అలాగే శాంతి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. అని మహేష్ చాలా ఫ్రెండ్లిగా పేర్కొన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో అర్జున్ సినిమా ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అప్పుడు ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.అంతా బాగానే ఉంది.

 కానీ మొదట ట్వీట్ చేసినప్పుడు మహేష్ బాబు ఒక పొరపాటు చేశాడు. ప్రభాస్ ఐడి అనుకోని ఎవరిదో ఫేక్ ఎకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. అయితే ప్రభాస్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోవడంతో ఆడియెన్స్ షాక్ అయ్యారు. ఆ ఎకౌంట్ ఓపెన్ చేయడంతో రాకేష్ అనే మరో పేరు చూపించింది. ఇక కొద్దీ సేపటికి తన పొరపాటు తెలుసుకున్న మహేష్ వెంటనే ట్యాగ్ తీసేశాడు.మొత్తానికి మన డార్లింగ్ కి విష్ చేయబోయే ఆత్రంలో మహేష్ ఈ విధంగా పప్పులో కాలేసాడన్న మాట...!!


మరింత సమాచారం తెలుసుకోండి: