టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి పేరు ప్రఖ్యాతలు తో కొనసాగుతున్న అగ్ర నిర్మాత దిల్ రాజు మొదటిగా నితిన్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన అక్కడి నుండి వరుసగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి గోల్డెన్ లెగ్ నిర్మాతగా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు దిల్ రాజుకు ఆశించిన రేంజ్ విజయాలు దక్కలేదు. ఇటీవల కొన్నాళ్ల నుండి వరుసగా మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తున్న దిల్ రాజు, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమాను మరొక నిర్మాత బోనీ కపూర్ తో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అతి త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా తెరకెక్కనున్న ఎఫ్3 సినిమాను కూడా ఆయన నిర్మించనున్నట్లు సమాచారం. ఇకపోతే కొన్నేళ్ళ క్రితం నాగచైతన్య హీరోగా పరిచయమైన జోష్ సినిమా నిర్మించిన దిల్ రాజు ఆ సినిమా ద్వారా భారీ పరాజయాన్ని చవిచూశారు. నిజానికి ఆ సినిమా యొక్క కథా కథనాలు బాగున్నప్పటికీ కూడా ఆ సినిమాని సరైన సమయంలో రిలీజ్ చేయకపోవడం వల్లనే అది ఫ్లాప్ అయిందని కొన్ని సందర్భాల్లో రాజు చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని ఏళ్ల అనంతరం ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా థాంక్యూ అనే సినిమా తన బ్యానర్ పై మొదలెట్టారు దిల్ రాజు.

అయితే దాని తర్వాత నాగచైతన్య సోదరుడైన అఖిల్ తో కూడా తప్పనిసరిగా ఒక అద్భుతమైన సినిమాను తీస్తానని అలానే చైతన్యకు థాంక్యూ సినిమా ద్వారా పక్కాగా హిట్ ఇస్తానని, ఆపై అఖిల్ తో కూడా మంచి భారీ హిట్ ని అందుకుంటానని తన సన్నిహితుల వద్ద ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి విజయాలతో కొనసాగుతున్న దిల్ రాజుకు నాగార్జున తో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. కావున తప్పనిసరిగా అక్కినేని సోదరులతో ఆయన మంచి సినిమాలు తీస్తారని అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో దిల్ రాజు ఆ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: