బాహుబలి రెండు సినిమాల విజయాల తర్వాత ఒక్కసారిగా దేశవిదేశాల్లో విపరీతమైన క్రేజ్ పాపులారిటీ తో పాటు భారీ స్థాయి మార్కెట్ ను కూడా సంపాదించుకున్న నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం సినిమాతో అతి పెద్ద కమర్షియల్ బ్రేక్ ను అందుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ప్రభాస్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే బాహుబలి సినిమాల తర్వాత మాత్రం ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా తారా స్థాయికి చేరడం ఇక అక్కడి నుంచి ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఉండటం కొనసాగుతోంది.

గతేడాది సాహూ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా మూడు వందల యాభై కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు అతి త్వరలో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా ఖర్చు దాదాపు రూ. 600 కోట్ల వరకూ ఉంటుందని ఆ సినిమా నిర్మాత అశ్వినీదత్ క్వాలిటీ విషయంలో ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వడం లేదని అంటున్నారు.

మరోవైపు అతి త్వరలో ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ. 700 కోట్ల వరకు ఉండే చాన్స్ ఉందని సమాచారం. కాగా ఆ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అందులో రావణాసురుడు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా చూసుకుంటే ఇకపై ప్రభాస్ చేసే సినిమాలన్నీ కూడా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కనున్నట్లు మనకు అర్ధం అవుతుంది. మరోవైపు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్న నిర్మాతలు కూడా ప్రభాస్ కోసం ఎంతైనా ఏమైనా సరే మేము రెడీ అనే రీతిన భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఈ సినిమాలతో కనక భారీగా సక్సెస్ లు అందుకుంటే ఆపై పాన్ వరల్డ్ స్టార్ గా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: