ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి కొన్ని రోజులే అయినా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎక్స్ పెక్టేషన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని జక్కన్నే స్వయానా తెలిపాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ ’ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే ప్రిన్స్ మహేశ్ బాబు కూడా ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ఉన్నాడు.
కాగా ఈ ఇరువురి సినిమాలు పూర్తికాగానే మహేశ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ కథను ఇప్పటికే కంప్లీట్ చేశాడని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో ప్రిన్స్ మహేశ్ బాబు శివాజీ పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ఈ వార్తను విన్న మహేశ్ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.