ఎక్స్ ప్రెస్ రాజా సినిమా లో అద్భుతమైన కామెడీని పండించి నంది అవార్డు కూడా గెలుచుకున్న హాస్యనటుడు సప్తగిరి నిన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితం అయ్యారు కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కమెడియన్ అయ్యి.. కమెడియన్ నుంచి హీరోగా సప్తగిరి ఎదిగారు. ఆయన హీరో గా సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి సినిమాలను చేశారు కానీ అవేమీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ను రాబట్టలేకపోయాయి.

అయితే ఇప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు రెడీ గా ఉంటున్నారు. ప్రస్తుతం సప్తగిరి ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోగా చేస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమా చేయలేరు. అలాంటిది ఒక సాదాసీదా కమెడియన్ అయిన సప్తగిరి పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

దర్శకుడు సూర్యస్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి '8' అనే ఒక సస్పెన్స్ ని కలిగించే ఓ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాని తెలుగు తో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది చిత్ర బృందం. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ని రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. నిజానికి సప్తగిరి సినిమా ఐదు కోట్లు కలెక్ట్ చేయడమే గగనం అనుకుంటే.. ఆయన కొత్త మూవీ ని ఏకంగా రూ. 25 కోట్ల బడ్జెట్ రూపొందిస్తుండడం విశేషం.  ఈ సస్పెన్స్ త్రిల్లర్ తమిళ, హిందీ, కన్నడ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్  వర్కౌట్ అయితే తాము పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని చిత్రబృందం భావిస్తోందట. మరి ఈ హై-బడ్జెట్ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: