సినిమా రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి కృతి నటన గురించి ఎంతో గొప్పగా చెప్పి , నిర్మాతలు ఇప్పుడే కృతి డేట్స్ తీసుకోవాలని సినిమా రిలీజ్ తర్వాత ఆమె దొరకడం కష్టమని వేదిక సాక్షిగా చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. ఉప్పెన రిలీజ్ తర్వాత అమ్మడి క్రేజ్ ఆకాశానికి తాకింది. ప్రతి డైరెక్టర్ , నిర్మాత , హీరో ఈమె కావాలని పట్టుపడుతున్నారు. ఇప్పటికే రామ్ , నాని సరసన రెండు సినిమాల్లో నటిస్తుంది. ఉప్పెన ఛాన్స్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే వరుసగా మూడు సినిమాలు చేయబోతుందట.
ఈ మూడు సినిమాలకు తన రెమ్యూనరేషన్ ను గట్టిగానే పెంచినట్లు తెలుస్తుంది. మొదటి చిత్రానికి 20 లక్షలు తీసుకున్న కృతి.. మిగతా సినిమాలకు 70 లక్షలు తీసుకుంటుందట. అంతే కాదు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. మరి వీరికి మాత్రమే 70 లక్షలు , మిగతావారికి అంతకు మించి అన్నట్లు చెపుతుందట. మొత్తం మీద ఒకే ఒక సినిమాతో కృతి సినీ కెరియరే మారింది.