తమిళ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్... కోలీవుడ్ లో తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ తమిళ కుట్టి. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ఈ భామ. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు మార్మోగుతోంది. క్రాక్ సినిమా లో జయమ్మ పాత్ర చాలా బాగా క్లిక్ అయింది. దీనితో వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు లో ఆఫర్లు వస్తున్నాయి.

రవితేజ మూవీ క్రాక్‌లో జయమ్మ పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ క్రేజ్ అమాంతం రెట్టింపయింది. జయమ్మ గా ఈమె యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. అదే విధంగా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన నాంది సినిమా లో కూడా ఈమె స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఇచ్చిన విజయం అటు అల్లరి నరేష్ తో పాటు, ఇటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలంటే మొదటిగా వరలక్ష్మి పేరే వినిపిస్తోంది. అంతగా తన యాక్టింగ్ తో అందరిని ఆకర్షించారు వరలక్ష్మి.

అయితే ఇప్పుడు ఇదే ఈమెను ఓ సినిమాలో కీలకమయ్యేలా  చేసింది. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు. 'ఛేజింగ్' అనే చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లీడ్ రోల్ చేస్తున్నారు వరలక్ష్మి. ఈ చిత్రంలో డ్రగ్స్ ముఠాకు చుక్కలు చూపించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. మరి ఈ చిత్రం ఈమెకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: