మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు సావిత్రి. అప్పట్లో హీరోల హవా ఎక్కువగా కొనసాగేది.కాని మహా నటి ఇండస్ట్రీకి వచ్చాక స్టార్ హీరోలకు పెద్ద పోటీగా మారింది. వారికి పోటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది సావిత్రి.ఎన్నో సామాజిక సేవలు చేస్తూ తెలుగునాట అలాగే తమిళంలో కూడా కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకుంది సావిత్రి.తెలుగు,తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.ఇక ఆమె జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం అందించాడు. కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించింది. సావిత్రి పాత్రలో కీర్తి ఎంతగానో ఒదిగిపోయింది.నటించింది అనే కంటే జీవించింది అనే చెప్పాలి.


ఈ చిత్రంతో ఆమె ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. వైజయంతి మూవీస్,స్వప్న సినిమా బ్యానర్ల పై సి.అశ్వినీదత్ ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.2018వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 3 ఏళ్ళు కావస్తోంది.ఇక ఈ సినిమా విడుదల అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డు స్థాయిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వసూళ్లు రాబట్టింది.ఈ సినిమా కొన్న బయ్యర్లు మంచి లాభాలను పొందారు.ఇక ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే మహానటి చిత్రానికి రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.46.10 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లు రూ.25 కోట్ల లాభాలను ఈ సినిమా తెచ్చిపెట్టింది.బయోపిక్ సినిమాలలోనే ఈ సినిమా పెద్ద రికార్డుని సృష్టించింది. అలాగే ఈ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: