తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలనటిగా అడుగు పెట్టి..ఆ తర్వాత హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది అందాల తార రాశి.తన కెరీర్లో యాభై కి పైగా సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించారు.ఇక తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లో నటించిన రాశి.. ప్రేమ పెళ్లి చేసుకొని తన సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది.2006 తర్వాత ఈమె సినిమాల్లో నటించడం మానేసింది. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని 2013 లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చించి.లంక అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన రాశి..

 ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేయడమే కాకుండా..ఆ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయి.. ఆర్ధికంగా కూడా రాశి ని దెబ్బతీసింది.ఇక ప్రస్తుతం ఈమె సినిమాలు వదిలేసి.. సీరియల్ నటిగా మారింది.ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్ లో ఒక సీరియస్ రోల్ లో నటిస్తోంది.ఈ సీరియల్ కి మంచి టీఆర్పీ రావడంతో.. ఈ సీరియల్ కి రాశి తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.ఆ సీరియల్ కి రాశి స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ కావడంతో పాటూ..

సీరియల్ లో ఆమె పాత్రకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోందట.దీంతో ఈ హీరోయిన్ కి వారానికి ఏకంగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తాజా సమాచారం.అయితే ఒకప్పుడు తాను హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో కొన్ని లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్న రాశి.. చివరికి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ కి పని చేస్తుండటం చాలా దారుణమనే చెప్పాలి.అప్పట్లో ఆమె నటించిన సినిమాలకి కోట్ల సంపాదనతో సెటిల్ అవ్వాల్సింది. కానీ ఏం చేస్తాం పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం రాశికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఉన్నంతలో తాను చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: