ప్రస్తుతం ఈ విషయంలో ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కాగా కోర్టు ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే కంగనా రనౌత్ ఈ నెలలో షూటింగ్ కోసం హంగేరిలోని బుడాపెస్ట్కు బయలుదేరి వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంది. 15వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ దాకా మూవీ యూనిట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కంగనా పాస్ పోర్టు గడువు సెప్టెంబర్ 15న అయిపోతోంది. దీంతో ఈ క్రమంలో పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయాలనీ అధికారులను రీసెంట్గా కంగనా రనౌత్ కోరింది.
అయితే ఇప్పుడు కంగనా పై పోలీస్ కేసు ఉన్నందున తాము పాస్పోర్టును రెన్యూవల్ చేయలేమని అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇందుకు కారణం ఏంటంటే ఎవరికైనా పాస్ట్ పోర్ట్ రెన్యువల్ చేయాలంటే పోలీస్ వెరిఫికేషన్ కచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ మధ్య బాంద్రా పోలీస్ స్టషన్లో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు కావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ కేసు నేపథ్యంలో కంగనా రనౌత్ పాస్ పోర్ట్ రెన్యూవల్ చేయడనికి అటు అధికారులు సైతం పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.