ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఒక్కసారిగా పెరగడంతో మిగతా అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా దెబ్బపడింది. దానితోఎక్కడికక్కడ షూటింగ్స్ నిలుపుదల చేయబడ్డాయి. ఇక కొత్తగా షూట్ ప్రారంభించుకున్న సినిమాలతో పాటు త్వరలో విడుదలకు సిద్దమై రిలీజ్ డేట్స్ ప్రకటించిన సినిమాలు సైతం ఆగిపోక తప్పది పరిస్థితి ఏర్పడింది.
అయితే గత వారం రోజులుగా మన దేశంలో కరోనా పరిస్థితులు మెల్లగా తగ్గుముఖం పట్టడం, పాజిటివ్ కేసులు కూడా తగ్గడంతో  ఎక్కడికక్కడ ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు, అందుతున్న సమాచారాన్ని బట్టి జులై నెల మొదటి వారంలో షూటింగ్స్ మొదలయ్యే ఛాన్స్ కనబడుతుండడంతో పాటు రెండవ వారం నుండి సినిమా హాల్స్ కూడా తెరవనున్నట్లు సమాచారం. మరోవైపు కొద్ది పార్ట్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉన్న తమ సినిమాలను వీలైనంత త్వరగా ముగించి వాటిని థియేటర్స్ లోకి తీసుకురావాలని ఇప్పటినుండే ఆయా సినిమాల మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇటీవల ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేస్తున్న నారప్ప మూవీ, కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిఉండడంతో దానిని త్వరితగతిన పూర్తి చేసి మూవీని త్వరలో మూవీని రిలీజ్ చేసేలా చూస్తున్నారట. అలానే ఈ సినిమాని పక్కాగా ఆగష్టు రెండవ వారంలో థియేటర్స్ లోకి తీసుకురానున్నారని అంటున్నారు. మొదటగా టాలీవుడ్ లో కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత విడుదలయ్యే సినిమా నారప్ప మాత్రమేనని టాక్. వెంకటేష్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా గతంలో ధనుష్ హీరోగా తమిళ్ లో రూపొంది సూపర్ హిట్ కొట్టిన అసురన్ కి రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: