జబర్దస్త్ బ్యూటీ అనసూయ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. మా మ్యూజిక్, టీవీ9 ఇలాంటి చానల్స్ లో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. క్షణం సినిమా లో తనదైన నటనతో అనసూయ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ సుక్కు కాంబినేష‌న్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో చ‌ర‌ణ్ కు అత్త‌గా న‌టించి అద‌ర‌గొట్టింది. దాంతో వరుస ఆఫర్లు ఈ అమ్మడి వద్దకు వస్తున్నాయి. అలా చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్నింట్లోనూ అన‌సూయ వ‌రుస‌ అవకాశాలు దక్కించుకుంటోంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అనసూయ మెప్పిస్తోంది. 


ఇక‌ ప్రస్తుతం అనసూయ రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమా లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలు అన‌సూయ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ భామ త్వరలోనే తమిళ, మలయాళ చిత్రాల్లో కనిపించబోతున్న‌ట్టు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఎంతో సక్సెస్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. హాట్ హాట్ అందాలతో ఫోటో లు పెడుతూ కుర్రాళ్లను త‌న‌వైపు తిప్పుకుంటోంది.
 

చిట్టిపొట్టి బట్టలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అనసూయ ఓ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో చీరకట్టులో నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ఫోటోలకు నేను పర్ఫెక్ట్ కాదు నేను ఒరిజినల్ అంటూ అన‌సూయ‌ క్యాప్షన్ పెట్టింది. కాగా అనసూయ పోస్ట్ కు యాంకర్ విద్య నువ్వు నువ్వు ఫర్ఫెక్ట్ లీ ఒరిజినల్ అనే క్యాప్షన్ పెడితే సరిపోయేది అని కామెంట్ చేసింది. మ‌రో వైపు అన‌సూయ‌ అభిమానులు ఈ ఫోటో చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు. ఈమధ్య ఫోటోలు పెట్టడం మానేసావ్ ఏంటి అనసూయ అంటూ అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: