అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుండగా అందులో ఒక మూవీ రిలీజ్ కి రెడీ అయింది, ఇక మరొక మూవీ సెట్స్ మీద ఉంది. అయితే ఆ రెండిటిలో ప్రస్తుతం రిలీజ్ కి రెడీ గా ఉన్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించగా గోపిసుందర్ మ్యూజిక్ అందించారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ మూవీని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇక మరొకవైపు సురేందర్ రెడ్డి తో అఖిల్ చేస్తున్న సినిమా ఏజెంట్. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో అఖిల్ ఒక రా ఏజెంట్ గా కనిపించనుండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ప్రముఖ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్నట్లు సమాచారం. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని క్షణాల పాటు కనపడి కథని కీలక మలుపు తిప్పే రోల్ ఒకటి ఉందని, కాగా  ఆ రోల్ కోసం ఇప్పటికే పలువురిని పరిశీలించిన ఏజెంట్ యూనిట్, ఫైనల్ గా బాలీవుడ్ నటుడు ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్న అజయ్ దేవగన్ ని తీసుకునేందుకు సిద్దమైనట్లు టాక్.

హీరో నాగార్జున కు బాలీవుడ్ స్టార్ నటులతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో నాగ్ కోరిక మేరకు ఏజెంట్ లో అజయ్ నటించే ఛాన్స్ లేకపోలేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కాగా ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: