దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయ రంగం నుంచి తిరిగి సినీ రంగ ప్రవేశం చేసి ఈ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకులకు వద్దకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.. ఇక ఈ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే శిరీష్ కలిసి నిర్మించారు.. ఇక ఈ సినిమా లో అనన్య నాగల్ల, అంజలి, నివేదాథామస్ అద్భుతంగా నటించారు..
కథానాయిక పాత్రలో శృతి హాసన్ మూడో సారి పవన్ కళ్యాణ్ తో జత కట్టడం విశేషం. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే, కరోనా సమయంలో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఈ సంవత్సరం రికార్డు సృష్టించింది. 2021 ఏప్రిల్ 9వ తేదీన కరోనా కాలంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 137.65 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.. ఇకపోతే ఈ సినిమాలో వచ్చిన" మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. అనే పాట ఎంత అద్భుతం అంటే ఒక మహిళ లేనిదే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు అన్న అర్థం వచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు.. ఇక ఈ పాట విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే మంచి వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక నాటి నుంచి నేటి వరకు కూడా ఈ పాట హైలెట్ గా నిలిచింది.