
ఫిలిమ్ ఇండస్ట్రీలో తాజాగా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. పాన్ ఇండియా అంటున్నారు. లేకపోతే మల్టీస్టారర్ మూవీ అంటున్నారు. ఒక హీరో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ సినిమాలు చూస్ చేసుకుని హిట్ కొడితే అదే కంటెంట్ చూస్ చేసుకుని మిగతా హీరోలు కూడా హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు . అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ అనే యాంగిల్ నే మర్చిపోతున్నారు స్టార్ హీరోస్.
ఒకప్పుడు బిగ్ బడా స్టార్ హీరో సినిమాలలో కొంచమైనా కామెడీ ఉండేది . కచ్చితంగా 100% మూవీలో 30% కామెడీ తో నవ్వించేవారు. అది యాక్షన్ మూవీ అయినా సరే. ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమా అంటూ ఏ హీరో కూడా కామెడీ యాంగిల్ ను టచ్ చేయలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ నటించిన సినిమాలు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్ అందరూ కూడా సినిమాను ఒక స్పెషల్ ధీమ్ తో తీసుకెళ్తున్నారు .
ఒకప్పుడు చరణ్ - తారక్ - అల్లు అర్జున్ తమ సినిమాల విషయంలో కామెడీను కచ్చితంగా ఉండేలా చూసుకునే వాళ్ళు . కానీ ఈ మధ్యకాలంలో మాత్రం దాన్ని మిస్ అయిపోతున్నారు . నెమ్మది నెమ్మదిగా కామెడీ అనే పదాన్ని మర్చిపోయి పూర్తిగా బానిసలు అయిపోతున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఇదే జరిగితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బడా స్టార్స్ నుంచి కామెడీ యాంగిల్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఇక మర్చిపోవాల్సిందే అంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చూస్తూ ఉండడం గమనార్హం..!!