కాపు ఉద్యమాన్ని వైసీపీ వర్గాలు కావాలనే పక్కదారి పట్టించాయని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసీపీకి కమ్మ కులస్తులు బద్ధ శత్రువులు అని వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమి కొట్టాలనే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎవరికైనా కులం కాదు... గుణం ప్రధానం అన్నారు పవన్. 151 సీట్ల బలం ఉందని ఒక వర్గాన్ని పూర్తిగా తొక్కేస్తాం అంటే చూస్తూ ఊరుకోవాలని అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనసేనాని ప్రశ్నించారు. ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు తనపై కులం పేరుతో ఆరోపణలు చేస్తున్నారని... రాబోయే ఎన్నికల్లో మీరా... మేమా తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో రెచ్చిపోయారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
కాపు ఉద్యమాన్ని వైసీపీ వర్గాలు కావాలనే పక్కదారి పట్టించాయని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసీపీకి కమ్మ కులస్తులు బద్ధ శత్రువులు అని వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమి కొట్టాలనే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎవరికైనా కులం కాదు... గుణం ప్రధానం అన్నారు పవన్. 151 సీట్ల బలం ఉందని ఒక వర్గాన్ని పూర్తిగా తొక్కేస్తాం అంటే చూస్తూ ఊరుకోవాలని అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జనసేనాని ప్రశ్నించారు. ఉద్యమాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు తనపై కులం పేరుతో ఆరోపణలు చేస్తున్నారని... రాబోయే ఎన్నికల్లో మీరా... మేమా తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు పవన్ కల్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో రెచ్చిపోయారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.