మోడీ అంటేనే కొందరికి భయం. వణుకు. ఆయన ఏం చేయాలంటే చేసేస్తారు. అదురు బెదురూ లేవు. ఓ విధంగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ తరువాత ఆ స్థాయిలో దేశంలో చక్రం తిప్పుతున్న నేత. మోడీకి ఎవరేంటి అన్నది తెలుసు. అందరి జాతకాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వాటిని తిరగేస్తే చాలు, కూసాలు కదిలిపోతాయి మరి.

 

ఇదిలా ఉండగా మోడీ ఇపుడు సూపర్ ప్లాన్ లో ఉన్నారుట. కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. దాంతో దేశం ఆర్ధికంగా కుదేలు అయిపోయింది. అసలే గత  మూడేళ్ళుగా దేశం పరిస్థితులు ఏ మాత్రం బాగులేవు. ఏ ముహూర్తాన పెద్ద నోట్లు రద్దు చేశారో నాటి నుంచి దేశంలో ఆర్ధిక ఇబ్బందులు మొదలైపోయాయి. 

 

అవి అలా ఉండగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంధ్యం దేశంలొ కూడా తన తడాఖా చూపిస్తోంది. ఈ నేపధ్యమే భయానకం అనుకుటే ఇపుడు కరోనా వచ్చి మొత్తానికి మొత్తం కర్చు చేసేసింది. పద్దు రాసేసింది. ఈ ఆర్ధిక సుడిగుండంలో నుంచి ఎలా బయటపడాలి. ఎలా దీని నుంచి తట్టుకునేది అన్నది ఇపుడు మోడీ వంటి పెద్దల బుర్రలను వేడెక్కిస్తోంది.

 

అయితే ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది. దానికే మోడీ మార్క్ మాస్టర్ ప్లాన్ పదును పెడుతున్నారుట. దేశంలో ఉన్న కోటీశ్వరులకు ఇపుడు మోడీ గట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారని అంటున్నారు. ఇంతకాలం కడుతున్న పన్నులు, చూసీ చూడనట్లుగా వదిలేస్తున్న వైనాలు అన్నీ కూడా ఒక్కసారిగా పట్టుకుని గట్టిగానే బిగించేస్తారని అంటున్నారు. 

 

సూపర్ టాక్సులను  మల్టీ మిలీనియర్ల మీద బాగానే  విధించాలని, బాదాలని  మోడీ సర్కార్ స్కెచ్ గీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ దేశం పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్న‌ పేద దేశం. ఈ దేశంలో ఉన్న కోటీశ్వ‌రుల సొమ్ము అంతా పేదల రక్తమే. అయితే వారు కనీసం బాధ్యతగా  పన్నులు కూడా కట్టకుండా తప్పించుకుంటున్నారు. నల్ల డబ్బు పోగేసుకుంటున్నారు. 

 

అలాంటి వారి జాతకాలు బయటకు తీయడమే కాకుండా సూపర్ టాక్స్ విధించి ఇబ్బండి ముబ్బడిగా రాబట్టాలని కేంద్రం ఆలోచన చేస్తోందిట. అదే కనుక జరిగిత ఈ కరోనా స్రుష్టించిన గండం నుంచి దేశం గట్టెక్కుతుందని ఆలోచిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన  యాక్షన్ ప్లాన్ మొదలవుతుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: