దేశంలో ఓ వైపు కరోనాతో అల్లకల్లోలం అవుతుంది.. ఈ నేపథ్యంలో క్రైమ్ రేటు తగ్గుతుందని పోలీసులు అంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. లైంగిక వేదింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తనను నమ్మి వచ్చిన ఒక మహిళను దారుణంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కేరళలోని పాలక్కడ్లో చోటుచేసుకుంది. ఈ దారుణం కేరళలోని పాలక్కడ్లో చోటు చేసుకుంది. కొల్లాంలోని కొట్టాయంకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ట్రైనింగ్ అని ఇంట్లో చెప్పి మార్చి 17 న బయటికి వెళ్లిన సుచిత్ర ఆ మరుసటి రోజు నుంచి ఆచూకీ లేకుండా పోయింది. అయితే బయటకు వెళ్లిన సుచిత్ర ఎంత సమయానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియబరిచారు.. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్ తీవ్రతరం చేశారు పోలీసులు. పాలక్కడ్లోని మనాలి వద్ద ఓ అద్దె ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించి కేసును ఛేదించారు. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న సుచిత్రకు.. అప్పటికే పెళ్లయి కొడుకు ఉన్న 32 ఏళ్ల ప్రశాంత్ అనే వ్యక్తి ఓ ఫంక్షన్లో పరిచయమయ్యాడని.. అప్పటి నుంచి వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని అన్నారు.
అయితే ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు.. కానీ ప్రశాంత్ అంటే బాగా ఇష్టపడుతున్న సుచిత్ర ..ప్రశాంత్ను కలవడానికే మనాలి వెళ్లిందని.. కొట్టాయం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్ను అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో ప్రశాంత్ నింధితుడని తేలింది.. గత కొన్ని రోజుల నుంచి తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కోపంతో ఆమెను చంపి తన ఇంట్లోనే పాతిపెట్టినట్లు తెలిపాడు. ప్రశాంత్ను అరెస్టు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.