సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలలో భాగంగా దౌల్తాబాద్  మండలం ఇంద్రుప్రియల్, తిర్మలాపూర్ గ్రామాలలో  బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటింటి ప్రచారం  చేసారు. టీఆరెస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ రాష్ట్ర సొమ్మును దోచుకొని ఎన్నికలు వచ్చాయంటే ఆ సొమ్ముతోనే ఎన్నికలు చేస్తుంది అని ఆమె ఆరోపించారు.

టీఆరెస్ ప్రభుత్వం మేము చెప్పిన పంటలనే వేయాలని లేనిచో రైతు బంధు ఇవ్వమని చెప్పిన ప్రభుత్వం నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఏం కర్మనో ఏమో కాని మన ముఖ్యమంత్రి రైతులకు ఏ పంట వేయమని చెప్తాడో ఆ పంట పని ఖతమే అన్నారు. పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: