ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు జగన్ వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా వారికి మరింత ప్రయోజనం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేందుకు నిబంధనల సవరణకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్‌ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. కానీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ఇబ్బందిగా మారాయి. ఈ విషయం రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని.. మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. అయితే రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. ఇక్కడ ఈ నిబంధన ప్రతికూలంగా మారింది. 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. దీంతో కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన కూడా అదే పరిస్థితి. ఈ సమస్యల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: