విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నాశనం అయిపోయిన సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆయన త్వరలోనే పార్టీ మారడానికి సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు చర్చలు జరిపారని త్వరలోనే ఆయన పార్టీ మారవచ్చు అని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు బిజెపిని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉండటం ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా విశాఖ జిల్లాలో ఆయనకు మంచి పేరు ఉండటంతో ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు చాలా అనుకూలంగా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన ఎప్పుడు పార్టీ మారుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలక నేతల కోసం ప్రయత్నాలు చేస్తోంది.