కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనబడలేదు. దీనివలన బిజెపి అధిష్టానం నేతలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు కూడా సోము వీర్రాజు కు అర్థం కావడం లేదు. ఇక మీడియా సమావేశంలో కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ఆయన వ్యాఖ్యలకు మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు సోము వీర్రాజును తప్పించి మళ్ళీ కన్నా లక్ష్మీ నారాయణకు బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కన్నా లక్ష్మీ నారాయణ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సన్నిహితంగా ఉన్న తన స్నేహితులు, మాజీ మంత్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారని అన్నారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణను మరో పార్టీలో కి వెళ్ళకుండా అడ్డుకోవడానికి బిజెపి అధిష్టానం జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాబోయే వారం పది రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.