ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఉరుకుల పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే పౌష్టికాహార లోపం కారణంగా కొంతమంది కంటిచూపు సమస్యలతో బాధపడుతూ ఉంటే మరి కొంతమంది ఎలక్ట్రానిక్ డివైస్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇక ఆ వస్తువుల నుంచి వచ్చిన లైటింగ్ కారణంగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు మరికొంతమంది. ఇలా రోజురోజుకుకంటి చూపు మందగించి చివరికి అద్దాలు ధరిస్తే కానీ సరిగ్గా చూడలేని వారు ఎంతో మంది. ఇలా నేటి రోజుల్లో కంటి చూపు సమస్య అనేది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినాసైట్ కోసం కళ్లద్దాలు ధరించి ఉంటున్నారు.
అయితే దృష్టి లోపం ఉన్న వారి గురించి ఇటీవల ఓ సర్వేలో ఆసక్తికర నిజం బయటపడింది. ఎలాంటి కంటి సమస్యలు లేని వారితో పోల్చి చూస్తే.. కొద్దిపాటి కంటి చూపు సమస్య ఉన్న వారికి మరణ ముప్పు 29 శాతం అధికంగా ఉంటుంది అంటూ ద లన్సెట్ గ్లోబల్ హెల్త్ చెప్పుకొచ్చింది. ఆంధ్రులు.. తీవ్ర నేత్ర సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు ఏకంగా 29 శాతం గా ఉంటుంది అని ఈ సర్వేలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానంతో ఐదింటిలో 4 కంటి సమస్యలను పరిష్కరించుకో గలుగుతున్నామని త్వరగా మీ కంటి సమస్యలు పరిష్కరించకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.