అటువంటి క్రికెటర్లు ఉన్నారు. సమాజం మాట పక్కన పెట్టి కొందరు క్రికెటర్లు పెళ్ళై విడాకులు తీసుకున్న మహిళల ప్రేమించి వారిని పెళ్లాడారు.
శిఖర్ ధావన్: ఈ భారత్ క్రికెటర్ 2012లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. ఈమె..మెల్బోర్న్ నివాసి అయిన బ్రిటీషు బెంగాలీ మహిళ. ఆయేషా కి ముందుగా ఒక వ్యక్తి తో పెళ్ళై ఇద్దరు కూతుర్లు కూడా ఉండగా విడాకులు తీసుకుని శిఖర ధావన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు.. వయసులో కూడా తనకంటే పదేళ్లు పెద్దయిన ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధావన్. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. గత ఏడాది శిఖర్ ధావన్, ఆయేషాల కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.
మురళి విజయ్: టీమ్ ఇండియా ఓపెనర్ అయిన మురళీ విజయ్ నికితా వంజార ను వివాహం చేసుకున్నారు. నికితా ఎవరో కాదు... టీమ్ ఇండియా మరో క్రికెటర్ అయిన దినేష్ కార్తీక్ తొలి భార్య... అయితే అతడితో విడాకులు తీసుకున్న నికిత ఆ తరవాత విజయ్ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ విషయం ఎంత వైరల్ అయ్యింది తెలిసిందే.