బిగ్ బాస్ మోనాల్ జీవితానికి కొత్త వెలుగులు తీసుకొచ్చింది.. ఏవో సినిమాలు చేసింది. కానీ అంతగా హిట్ టాక్ ను అందించలేదు.. దాంతో ఇప్పుడు అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమస్ అయ్యింది. వరుస అవకాశాలు వద్దనుకున్నా కూడా వచ్చి పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈమె పేరు కూడా ఎక్కువగా వినపడుతుంది..ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి వెల్లడించింది. అంతేకాదు, ఏకంగా 21 గంటలు అదే పని అంటూ మేటర్ రివీల్ చేసింది.


చిన్న వయసులోనే సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన ఆమె.. ఆ తర్వాత 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి'తో పాటు పలు చిత్రాల్లోనూ నటించింది. అయినప్పటికీ గురింపు దక్కించుకోలేకపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం మళ్లీ రీఎంట్రీ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇలా చాలా రోజులు అతడితో క్లోజ్‌గా కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా వ్యవహరించింది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మోనాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.


50 లక్షలు పైగానే ముట్టాయని తెలిసింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఓంకార్ 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.డ్యాన్స్+' షో కోసం మోనాల్ గజ్జర్ ఏకంగా 21 గంటలు షూటింగ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది. 'ఆ షో కోసం 21 గంటలు షూట్ చేశాను. అయినా ఎంత ఫ్రెష్‌గా ఉన్నానో చూడండి. నా కష్టాన్ని ముఖంలో కనిపించకుండా చేస్తున్నాను. ఇప్పుడు నాకు నిద్ర బాగా వస్తోంది. హోటల్‌కు వెళ్లిన వెంటనే అదే పని చేయాలి' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.. ఏమని మోనాల్ పోస్ట్ చేసింది గానీ, అది ఇప్పుడు వివిధ రకాల కామెంట్లతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: