తెలంగాణాలో దారుణం జరిగింది. బాలిక తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే దోమ మండలం గుండాల గ్రామంలో ఈ దారుణం జరిగింది. 16 ఏళ్ళ బాలిక ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం పాలైందని అధికారులు మీడియాకు తెలిపారు. నెల రోజుల క్రితం పెద్దల అంగీకారం లేకుండా అదే గ్రామానికి చెందిన యువకుడిని సదరు బాలిక ప్రేమ వివాహం  చేసుకుందని సమాచారం. 

 

ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనలో ఎవరిది తప్పు అనేది తెలియదు గాని ఆత్మహత్యకు పాల్పడటంతో యువకుడి ఇంటి వద్ద బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు చేస్తున్నారు. ఈ అబ్బాయి కారణంగానే తమ అమ్మాయి చనిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: