కేరళలో ఏనుగును అతి దారుణంగా మానవత్వం మరిచిన మనుషులు చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగినప్పటి నుంచి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మనుషులు మూగ జీవాలపై ఎలా ప్రేమ చూపించాలి... మూగ జీవాలు మనుషుల పట్ల ఎంతదయతో ఉంటాయి. అనే విషయాలను అందరికీ తెలియ జేసే విధంగా ఎంతో మంది అధికారులు వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా స్వాతి లక్రా అనే ఐపీఎస్ అధికారి కూడా మనుషులకు మూగజీవాలకు మధ్య అనుబంధం ఎలాంటిది అని తెలిపేందుకు ఒక వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో ఎంతోమందికి ఎంతగానో నేర్పుతుంది అంటూ దీనికి ఐపీఎస్ అధికారి ట్యాగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Heartwarming video.
— swati Lakra IPS (@IGWomenSafety) June 4, 2020
Lots of lessons learnt......
Can you point out few??? pic.twitter.com/3vPjGF8cW0