కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’ అంటూ తెలుగు దేశం పార్టీ అధినాయకుడి పై విజయసాయిరెడ్డి ఎద్దేవా చేసాడు. బుధవారం ట్విట్టర్ వేదికగా తెలుగు దేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసాడు. అయితే చంద్ర‌బాబు నాయుడు  టీడీపీ పగ్గాలను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కింజారపు కి అప్ప‌గించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త బయటికి వచ్చిన నాటి నుండి ప్రతి పక్షాలు వారికీ తోచిన రీతిలో విమర్శలకు దిగుతున్నాయి.

 

ఇందులో భాగంగా వైసీపీ నాయకుడు విజయ సాయి రెడ్డి ఈ విషయమై ఘాటుగా స్పందించాడు. అయన తన ట్విట్టర్ ఖాతాలో ...కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు అంటూ విమర్శలను గుప్పించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: