టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్య కాలంలో కాస్త దూకుడు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన గొంతు వినిపిస్తున్న నేతల్లో ఆయన ఒకరు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ ఏడాది లో ఏపీ లో సిఎం మారే అవకాశం ఉందనే వ్యాఖ్యలు చేసారు. దీనితో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ చంద్రబాబు తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి.” అని ట్వీట్ చేసారు.
ఎన్నికలకు ముందు జగన్ గారు అసలు అధికారంలోకి రానే రారన్నాడు ఓ పబ్లిక్ పార్క్ ఆక్రమించుకున్న ఓ విశాఖ గల్లీ నాయకుడు. పచ్చ మీడియాలో డిబేట్లతో ఊదరగొట్టి ఇప్పుడు పూర్తికాలం అధికారంలో ఉండరంటున్నాడు. ఈ CBN తొత్తుల ప్రీపెయిడ్ సిమ్స్ కి రీఛార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 5, 2020