ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా టీడీపీని, చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తుండే వైసీపీ రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం సిఎం జగన్ గారు ఢిల్లీ వెళ్తే...బాబు, ఆయన బానిసలు, ఎల్లో మీడియా గుండెలు బాదుకుని నెత్తుటి వాంతులు చేసుకుంటున్నారు'' అని ఆయన విమర్శించారు. 

యువ సిఎం ఇమేజి పెరుగుతోందనే అసూయ, దుగ్ద స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారి. బాబూ, నువ్వో తిరస్కృతుడివి, రాజకీయంగా సమాధి అయిపోయావని అంటూ ఆయన విమర్శించారు. ఇక సైరా పంచెస్ పేరుతొ కూడా ఆయన అనేక మీమ్స్ షేర్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఈ మీమ్స్ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: