ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తెలంగాణ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పొగిడారు. ఏపీలో క‌రోనా బారినప‌డి త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌లు ఇస్తున్నార‌ని...కానీ ధ‌నిక రాష్ట్రమ‌ని చెబుతున్న కేసీఆర్ తెలంగాణ‌లో ఎందుకు ఇవ్వ‌డంలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.మంచిగా ఉన్న సెక్రటేరియట్‌ను కూలగొట్టి రూ.1000 కోట్లతో కొత్త సచివాలయాన్ని కట్టిస్తున్నారు.క‌రోనా బాధితుల‌ను మాత్రం కేసీఆర్ ఆదుకోవ‌డం లేద‌న్నారు.భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌ర‌ధిలో ఎంపీ కోమ‌టిరెడ్డి ప‌ర్య‌టించారు. ఉమ్మ‌డి నల్గొండ జిల్లాలో క‌రోనాతో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన కుంటుంబాల‌కు కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా 50 వేలు ఆర్థిక స‌హాయం అందిస్తాన‌ని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: