స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు రేపుతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ ఈ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లారు అని వేరేలా చెప్పనక్కర్లేదు..
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి పాటలన్నీ ఈ సినిమా పై అంచనాలను పెంచాయి..
కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలయిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. వంద కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడంతో చిత్ర యూనిట్ తాజాగా విశాఖలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి చెలిసిందే. ఈ చిత్రం తో బన్నీ సినిమా కెరియర్ మళ్ళీ ఫీక్స్ లోకి వెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాలో అన్నీ కోణాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయిందని ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా స్విస్ కాలమానం ప్రకారం, ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలైందని, ఈ సమయంలో తన స్మార్ట్ ఫోన్ నుంచి 'సామజ వర గమనా...' పాటను వింటున్నానని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 'వాటే బ్రిలియంట్ సాంగ్...' అని కితాబునిస్తూ, సంగీత దర్శకుడు థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట తన మదిని వీడటం లేదని అన్నారు. ఈ ట్వీట్ కు స్పందించిన తమన్ "కేటీఆర్ సార్... మీరు మా పాటను మరింత సెన్సేషన్ చేశారు. మీ రోజును మా పాటతో ప్రారంభించారని తెలుసుకుని ఎంతో సంతోషిస్తున్నాం" అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.