మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాం లో ఉన్నాడు. ముఖ్యంగా యువ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్న ఈ మెగా ప్రొడ్యూసర్ సొంత కొడుక్కి మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోతున్నాడు. సాయి ధరం తేజ్ ప్రతిరోజూ పండుగే హిట్ అయ్యింది. నిఖిల్ తో రీసెంట్ గా 18 పేజెస్ సినిమా మొదలు పెట్టారు. కార్తికేయతో చావు కబురు చల్లగా కూడా సెట్స్ మీద ఉంది. త్వరలో వైష్ణవ్ తేజ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

 

వీళ్ళందరితో చేస్తూ కొడుకుని మాత్రం లైట్ తీసుకుంటున్నాడు అల్లు అరవింద్. అల్లు శిరీష్ కూడా శ్రీరస్తు శుభమస్తు తర్వాత హిట్ కొట్టలేదు. ఒక్క క్షణం, ఏబిసిడి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే మనవాడు కొద్దిగా డిజప్పాయింట్ లో ఉన్నాడు. అయితే వేరే హీరోలకు మంచి కథలతో సినిమాలు చేస్తున్న అల్లు అరవింద్ శిరీష్ కు ఎందుకు లైఫ్ ఇవ్వలేకపోతున్నాడు అన్నది ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది.

 

అల్లు శిరీష్ తో కూడా అరవింద్ సినిమాలు ప్లాన్ చేస్తున్నా వచ్చిన కథలను తనకు సెట్ అవ్వదంటూ చెప్పడం జరుగుతుందట. అందుకే ఇక శిరీష్ తో సినిమా గురించి అరవింద్ కూడా ఆలోచించడం మానేశాడట. బయట హీరోలకు తన బ్యానర్ లో సూపర్ హిట్ లు ఇస్తున్న అల్లు అరవింద్ కొడుక్కి మాత్రం హిట్ ఇవ్వలేకపోతున్నాడు. మరి ఎక్కడ తేడా కొడుతుందో తెలియదు కాని మెగా హీరోలందరిలో ఒక్క అల్లు శిరీష్ మాత్రమే కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్నాడు. మరి శిరీష్ కు మనసుకి నచ్చే సినిమా కథ కోసం వెయిటింగ్ అని తెలుస్తుంది. అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. అల్లు శిరీష్ కూడా ఈసారి కొత్తగా ఏదైనా చేయాలన్న కసితో ఉన్నాడని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: