టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా అనగానే జనాలకు ఒక ఆసక్తి ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దెబ్బకు సినిమా విడుదల అయితే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉంటారు కొందరు. సినిమా మీద మహేష్ బాబు తో పాటు చాలా మంది ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా షూటింగ్ ని వచ్చే నెల 31 న మొదలు పెట్టే యోచనలో ఉన్నాడు మహేష్ బాబు. 

 

కరోనా ఉన్నా సరే ఏదోక సన్నివేశం చిత్రీకరించాలని భావిస్తున్నాడు. తన తండ్రి పుట్టిన రోజు కాబట్టి తనకు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మహేష్ బాబు... గ్యాప్ తీసుకునే అవకాశం ఉందీ అనేది టాలీవుడ్ జనాల మాట. మహేష్ బాబు... గ్యాప్ తీసుకుని చెయ్యాలి అని చూస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఈ సినిమా గురించి ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరో సినిమా త్రివిక్రమ్ తో చెయ్యాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్ తో ఉంది. 

 

సినిమా ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు అవుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ తో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమా ఖరారు కావడం తో మహేష్ బాబు ప్రస్తుత౦ చేసే సినిమాను త్వరగా పూర్తి చేసి తర్వాత గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: