చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. అందాల ఆరబోతకు ఎక్కడ తావివ్వకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే కేవలం తెలుగులోనే కాదు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది అతిధి రావు హైదరి. అయితే ఇటీవలే ఢిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ సేతుపతి సరసన అతిధి రావు హైదరి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అతిధి రావు హైదరి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాను నటించడం లేదు అంటూ ఇటీవలే అతిధి రావు హైదరి స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్స్ మళ్ళీ మొదలు కావడంతో తన షెడ్యూల్ ఎంతో బిజీ గా మారిందని అందుకే ముందు ఒప్పుకున్న సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ తుగ్లక్ దర్బార్ సినిమా నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అతిధి రావు హైదరి ప్లేస్లో రాశి ఖన్నాను హీరోయిన్గా తీసుకున్నామని ఇప్పటికే చిత్రంబృందం ప్రకటన చేసిన విషయం తెలిసిందే.