రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే ఫ్యాన్స్ కి ఒక నమ్మకం. రాజమౌళితో కలిసి సినిమాలు చేయడం మొదలు పెట్టాక ఆయన పూర్తిగా లేట్ మనిషి అయిపోయాడని అంటుంటారు. అయితే ప్రభాస్ ఆ స్ట్రాటజీ మార్చేస్తున్నాడని ప్రభాస్ లేట్ మనిషి అనే మరక పోగొట్టుకోవాలని చూస్తున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా మారాక తన ఆలోచనలతో పాటు తన సినిమాల స్పీడ్ కూడా పెంచుతాడని అనుకున్నారు. ప్యాన్ ఇండియన్ మార్కెట్ లాంటి ఒక భారీ మార్కెట్ ని నిలబెట్టుకోవాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉంటుందిలే అనుకున్నాడు.

ఆయన కరోనా ప్రభావం తగ్గిపోగానే ఒకేసారి రెండు సినిమాలని సెట్స్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడని అన్నారు. కానీ నిజానికి ప్రభాస్ మొదటి నుండీ ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే మరో సినిమా సెట్స్ మొదలు పెడుతూ ఉంటాడు. కానీ 2021 నుంచి అలా చేయడం మానేసి నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా షూటింగ్ తో పాటు, ఆది పురుష్ సినిమా షూటింగ్ ని ప్యారలల్ గా ప్రభాస్ కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నాడని అన్నారు. అయితే అది మున్నాళ్ళ ముచ్చటగానే నిలిచిపోయింది.

 మళ్ళీ ఒక సినిమా పూర్తి అయ్యాకే మరో సినిమా ఫార్మాట్ లోకి మళ్ళీ వచ్చేశాడని అంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రెడీ అవుతోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు. కరోనా భయంతో అందరూ ఉన్న చోటే షూటింగ్ చేసుకోవాలనుకుంటోంటే, ప్రభాస్ టీమ్ మాత్రం రాధే శ్యామ్ కోసం ఇటలీ వెళ్లి మరీ షూట్ చేస్తున్నారు. ఇది పూర్తి అయ్యాక ఆయన ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్తాడని, అది అంతా పూర్తి అయ్యాకనే నాగ్ అశ్విన్ సినిమా జోలికి వెళ్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: