తెలుగు సినిమాకి పవర్ స్టార్, ఆంధ్ర రాజకీయాలకు జనసేన అయినటువంటి పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలను షురూ చేస్తున్నాడు. ఇప్పటికే 4 సినిమాలు ప్రకటించగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కాగా.. మొన్న దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా అప్డేట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ డైరెక్టర్ అయినటువంటి సాగర్ కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా సూర్యదేవర నాగవంశీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. దసరా సందర్భంగా ‘కింగ్ ఆఫ్ యాటిట్యూడ్.. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్ తో రాబోతున్నారు’ అంటూ చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసినదే. మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి ఈ మూవీ రీమేక్ గా రానుంది.

ఇక మలయాళ వర్షన్లో బిజూ మీనన్ పోషించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ దుమ్ము దులపనున్నాడు. అలాగే అందులో మరో కీలక పాత్ర అయినటువంటి పృథ్వీరాజ్ పాత్రను దగ్గుబాటి రానా చేస్తాడనే టాక్ వినిపించింది. అయితే తాజాగా మరో హీరో పేరు తెరపైకి రావడం గమనార్హం. ఆ స్థానంలో యంగ్ హీరో నితిన్ నటించనున్నాడనే టాక్ ఓ వైపు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నితిన్ ఇప్పటికే 2 సినిమాల్లో నటించాడు. ఇటీవల నితిన్ నటించిన భీష్మ కూడా ఈ బ్యానర్లోదే.

కథ, కధనాల రీత్య ఈ సినిమా ఇద్దరు హీరోల ఇగోల వల్ల వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేదే మెయిన్ థీమ్. ఈ కధలో హీరోలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. ఈ వార్త గాని నిజమైతే పవర్ స్టార్ తో తన డై హార్డ్ ఫ్యాన్ నితిన్ తలపడేందుకు సిద్ధపడుతున్నారు. ఇకపోతే.. నితిన్ కు ఎప్పటి నుంచో తన అభిమాన హీరో పక్కన ఓ సినిమా చేయాలని కోరిక. ఈ గాసిప్ గాని నిజమైతే నితిన్ కు ఇక పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: