మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.. మెగా మేనల్లుడు నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. మధ్య OTT సంతలు ఎన్ని ఆఫర్ ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. ఒకవైపు వైష్ణవ్ తేజ్‌కు తొలి సినిమా గండం వెంటాడుతుంది వార్తలు వస్తున్నాయి.. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రేయ్ లేట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  

ఇకపోతే ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో అందరు నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమైపోయారు.. కాగా ఉప్పెన సినిమా ని డిసెంబర్ లో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో యూనిట్ కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసుకుందని సమాచారం. సంక్రాంతి కి రిలీజ్ చేద్దామంటే అప్పుడు రిలీజ్అయ్యే సినిమాల లిస్ట్ పెద్దదిగానే ఉంది.. అరణ్య, రెడ్, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వచ్చే అవకాశాల గురించి గట్టి ప్రచారమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ సినిమా ని అప్పుడు రిలీజ్ చేసి చేతులు కాల్చుకోకూడదు అని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.

దాంతో జనవరి మొదటి వారంలోనే సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారట.. గతంలో పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఇదే తరహాలో న్యూ ఇయర్ రోజే విడుదలై సూపర్ హిట్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం రామ్ నేను శైలజ సైతం నూతన సంవత్సర కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. సో సంక్రాంతి కంటే ముందే వస్తే సినిమా ఆడదని చెప్పడానికి లేదు. ఈ లెక్కన ఉప్పెనకు ఫస్ట్ వీకే మంచి ముహూర్తంగా కనిపిస్తోంది. అవకాశం కుదిరితే ఒకటో తేది అయితే ఎలా ఉంటుందన్న కోణం కూడా చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: