కాగా ఆయనకు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇకపోతే దీని తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో మలయాళం మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్లో మెగాస్టార్ నటించనున్నారు. కాగా ఈ సినిమాను కూడా రామ్ చరణ్ నిర్మించనున్నారు. ఇక దీని తర్వాత వేదాళం సినిమా రీమేక్లో మెగాస్టార్ నటించనున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు మెహర్ రమేష్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా ఒక టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని ఎంతో భారీ లెవల్లో నిర్మించనుంది. కాగా ఇటీవల ఈ సినిమా కథ కు సంబంధించి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టులో కొంత వరకు మార్పులు చేర్పులు చేసిన దర్శకుడు మెహర్ రమేష్ ఎలాగైనా దీన్ని పెద్ద సక్సెస్ చేసేలా అన్ని విధాలా కృషి చేస్తున్నాడట.
తన కెరీర్ పరంగా కొన్ని ఏళ్ళ క్రితం నుండి సినిమాలు తీయడం ఆపేసిన మెహర్ రమేష్ ఎట్టకేలకు మెగాస్టార్ ని తనకు ఒక్కసారిగా దర్శకత్వం వహించే అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్ పరంగా భారీ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెహర్ రమేష్ తో మెగాస్టార్ సినిమా అనగానే మొదటి నుంచి ఆయన అభిమానుల్లో కొంత అనుమానం నెలకొంది. అయినప్పటికీ కూడా మెగాస్టార్ ఈ సినిమాని చేయడానికి ఒప్పుకున్నారు అంటే కథలో మంచి పాయింట్ ఉండి ఉంటుంది అలాగే కథనం, మెహెర్ రమేష్ మీద నమ్మకం వంటివి కూడా ఉండటం వల్లనే ఆయన ఒప్పుకుని ఉంటారని, మొత్తంగా చూసుకుంటే దర్శకుడు మెహర్ రమేష్ మీద తామందరమూ భారం వేశామని, నీట ముంచినా పాల ముంచినా అతడే దిక్కు అని పలువురు మెగాస్టార్ అభిమానులు అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు....!!