ఇక మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లాక్డౌన్ ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. పుష్ప రాజ్ అనే మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పలు యాక్షన్ మరియు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఈ రెండు సినిమాలకు సంబంధించి విలన్ గా తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఎంపీగా చేశాయట ఆ సినిమా యూనిట్ లు. మరోవైపు పలు తమిళ సినిమాలతో పాటు పలు ఇతర భాషల సినిమాలతో కూడా బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఈ రెండు సినిమాల్లో దేనిలో విలన్ గా నటిస్తారు అనే విషయమై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
నిజానికి ఆయనకు రెండు సినిమాల కథలు నచ్చాయని అయితే ప్రస్తుతం వరుసగా బిజీ షెడ్యూల్ ఉన్నందువల్ల ఆయన దేని వైపు మొగ్గు చూపుతారో ఏ సినిమాలో నటిస్తారు అనే దానిపై మాత్రం ఇప్పటికిప్పుడు క్లారిటీ వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. మరి నిజంగానే విజయ్ సేతుపతి ఈ రెండు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నారా, అలాగే ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి వాటిపై క్లారిటీ రావాలంటే వీటికి సంబంధించి ఆయా మూవీ యూనిట్స్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు....!!