అయినా ఇప్పటికీ రణబీర్ మరియు దీపికలు మంచి స్నేహితులు గానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు క్యూట్ లిటిల్ గర్ల్ ఆలియా భట్ దాదాపుగా రెండేళ్ళ నుండి రణబీర్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరి మధ్య ఘాటైన ప్రేమాయణం సాగుతోందని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరి గురించిన మరో తాజా వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆసక్తికరంగా మారింది. మొదటిసారిగా ఈ జంట ఫాంటసీ డ్రామా బ్రహ్మాస్త్రలో జంటగా కనిపించారు. కాకపోతే లాక్ డౌన్ వల్ల మూవీ రిలీజ్ అంతకంతకు వాయిదా పడింది. ఆన్ స్క్రీన్ పై కూడా వీరి జంట సూపర్ అంటున్న అభిమానులకు మరో ఆసక్తికరమైన విషయం ముందుకొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం...ఆలియా బాంద్రాలోని పాలి హిల్ కాంప్లెక్స్ లో ఐదో అంతస్తులో ఖరీదైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడ మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే.. తన ప్రేమ రాకుమారుడు రణబీర్ కపూర్ కి కూడా అదే పాలి హిల్ కాంప్లెక్స్ లో 7వ అంతస్తులో బ్యాచిలర్ హోమ్ ఉందట. ఇదేదో ఈ లవ్ బర్డ్స్ దూరాన్ని మరింత దగ్గర చేసే వంతెన అంటున్నారు నెటిజన్లు.ఈ కాంప్లెక్స్ రణబీర్ ఫ్యామిలీ నివశించే `కృష్ణ రాజ్ బంగ్లా`కు చాలా దగ్గరలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆలియా ఇల్లు విషయానికొస్తే భూలోకాన్ని మరిపించే స్వర్గం లా ఉందట. దీని విలువ ఏకంగా 32 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుంది బాలీవుడ్ మీడియా. ఎంతో విలాసవంతమైన ఈ భవనాన్ని ఆలియా తన టేస్ట్ కు తగ్గట్లుగా ప్రతిదీ డిజైన్ చేయించిందట.