ఈ సినిమాకు 'సలార్' అనే టైటిల్ ప్రకటిస్తూ రెబల్ స్టార్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది టీమ్. దీంతో ఒక్కసారిగా ఈ మూవీ చర్చల్లో నిలిచింది.ఇప్పుడు ప్రభాస్ నటించనున్న మూడు సినిమాలూ వేటికవే ప్రత్యేకతలు.. విశేషాలూ కలిగివున్నాయి. ఓమ్ రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' .. ఈ మూడూ కూడా భారీ చిత్రాలే.హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు వీపరీతమైన స్పందన లభించింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా గురువారం ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
సలార్ షూటింగ్ జనవరి 15 నుండి అంటే శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ముహుర్తం చేశాక… జనవరి చివరి వారం నుండి రెగ్యూలర్ షూట్ స్టార్ట్ అవుతుంది.శుక్రవారం జరిగే పూజా కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, రాజమౌళి, యష్ రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ను బట్టి సినిమాలో ప్రభాస్ ను క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఈ కార్యక్రమానికి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ మినహా మిగతా నటీనటుల ఎంపికను ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్కు జోడిగా బాలీవుడ్ భామ దిశా పటాని నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో విలన్ పాత్రలో కూడా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం విలన్గా నటించనున్నట్లు సమాచారం.