ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా హీరోస్ కి హిట్లు ప్లాపులు వస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరోలని తీసుకున్న వారికి పరాజయాలు వస్తుంటాయి. ఉదాహరణకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లనే తీసుకోండి.’ఖుషి’ తరువాత పవన్ కళ్యాణ్ కు 10 ఏళ్ళ వరకూ ప్లాప్ లు వెంటాడాయి.ఒక్క ‘జల్సా’ హిట్ అయినా అది పవన్ రేంజ్ హిట్ మూవీ కాదని అభిమానులే చెబుతుంటారు. ఇక మహేష్ బాబుకి ‘పోకిరి’ తరువాత 5 ఏళ్ళ వరకూ ప్లాప్ లు ప్లాపులు వచ్చాయి.

ఇక స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,మాస్ మహారాజా  రవితేజ లు కూడా ఒక టైములో ప్లాప్ లను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి మాత్రం వీరిద్దరికీ హ్యాట్రిక్ కాంబోలు కలిసి రావడం జరిగింది. ఎలా అంటే.. ‘సరైనోడు’ తరువాత అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం- డీజె’ మరియు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ చిత్రాలు నిరాశపరిచాయి. ఆ క్రమంలో బన్నీ తనకి రెండు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ తోనే సినిమా చేసాడు. అదే ‘అల వైకుంఠపురములో’. ఆ చిత్రం 2020 సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. బన్నీని ప్లాపుల నుండీ బయటపడేసింది. ఇక రవితేజ కూడా అంతే..‘రాజా ది గ్రేట్’ తరువాత సరైన హిట్టు లేని రవితేజ.. తనకి రెండు హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేనితో సినిమా చేసాడు. అదే ‘క్రాక్’.

ఈ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇలా బన్నీ, రవితేజ లు హ్యాట్రిక్ కాంబోలతోనే ప్లాపుల నుంచి బయటపడి మళ్ళీ హిట్ బాట పట్టారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: