మలయాళం సూపర్ స్టార్ అయినా మోహన్లాల్ నటించిన దృశ్యం సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లో సినిమా లో సందడి చేస్తున్నప్పటికీ ఈ మూవీని ఓటీటీ లో విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ నెల 19న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి  సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి.


 ఒక చిన్న పాయింట్ తో ఈ మూవీని ఆద్యంతం త్రిలింగ్ గా దర్శకుడు తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ క్రీడా ప్రముఖులు కూడా దృశ్యంపై ప్రశంసలు కురిపించారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇందులో మీ నాలుకపై రూల్స్ వచ్చాయి.  ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన మీనా కొన్ని సన్నివేశాల్లోనూ మీనా లిప్స్టిక్ లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై దర్శకుడు జీతూ జోసెఫ్ స్పందించారు. ఈ ట్రోల్ల్స్ తో నేను అంగీకరిస్తానని ఆయన అన్నారు.


 ఈ పాత్రకు నో మేకప్ లుక్ కావాలని తాను మీనాని అడిగానని అయితే డి గ్లామర్ లుక్ లో నటించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపారు. డి గ్లామర్ గా కనిపించేందుకు తనకు ఇష్టం లేదని నేను చెప్పింది అన్నారు. దృశ్యం మొదటి భాగంలోనూ మీనా పై ట్రోల్స్ రాగా ఆ విషయాన్నీ కూడా ప్రస్థావించినప్పటికీ మీనా ఒప్పుకోలేదని అన్నారు. అయితే లుక్ అంటే వారి పర్ఫామెన్స్ కి ప్రాధాన్యతను ఇచ్చే తాను ఆ చివరకు ఒప్పుకున్నట్లు తెలిపారు.


 మీనా మినహాయించి మిగిలిన అందరూ ఇందులో మేకప్ లేకుండా నటించేందుకు ఓకే చెప్పారని అన్నారు. ఏదేమైనా ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. కాగా  ఈ దర్శకుడు ఇప్పుడు తెలుగులో దృశ్యం రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 మార్చి నుంచి సెట్ మీదకు వెళ్లనుంది. తెలుగు వారి అభిరుచికి అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: