టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి చిత్రంలో రొమాంటిక్ హీరోగా యూత్ ని పరుగులు తీయించి, గీతా గోవిందం సినిమాతో మిస్టర్ పర్ఫెక్ట్ లా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకని మోస్ట్ వాంటెడ్ హీరోగా టాలీవుడ్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు విజయ్. భారీ ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోగా రోజురోజుకీ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. అయితే ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరో వైపు సొంత నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించి నిర్మాతగా తన దూకుడు చూపిస్తున్నారు.

ఇప్పటికే  ఈ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించి సినీ పెద్దల మన్నలను పొందాడు. ఆ తర్వాత ఇప్పుడు తన తమ్ముడు ఆనంద దేవరకొండ ప్రధాన పాత్రలో 'పుష్పక విమానం' మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో చిత్రానికి విజయ్ పరోక్షంగా భాగం కానున్నారని తెలుస్తోంది. ఓ సూపర్ హీరో సినిమాకి ప్రముఖ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారట మన యూనివర్సల్ ఫేమస్ లవర్. సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ వేరే నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారట విజయ్.

అయితే ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి అఫిషియల్ అన్నౌస్మెంట్ రాలేదు. కానీ ఈ వార్త నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చేతికందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సిద్దాంతాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు లైగర్ హీరో విజయ్ దేవరకొండ. మరి ఇలా కూడా సక్సెస్ అవుతడా ? అన్నది చూడాల్సి అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: